Breaking News

09/04/2019

హార్స్ రైడింగ్ తో పరీక్షకు

తిరువనంతపురం, ఏప్రిల్ 8, (way2newstv.in)
గుర్రంపై ఎక్కి సవారీ చేయడమంటే అందరికీ ఆసక్తే. కానీ, అదంత తేలికైన విషయం కాదు. ఎంతో నైపుణ్యం కావాలి. ఇక సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లకు గుర్రపు స్వారీ ఇంతో అంగో వచ్చి ఉండాలి. ఎప్పుడు ఏ సన్నివేశం ఎలా డిమాండ్ చేస్తుందో తెలీదు మరి. ఇటీవల ‘మణి కర్ణిక’ సినిమా కోసం కథానాయిక కంగనా రనౌత్ ఆర్టిఫిషియల్ గుర్రపు స్వారీ చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఆ మధ్య తెగ చక్కర్లు కొట్టింది. 


హార్స్ రైడింగ్ తో పరీక్షకు 

ఇలాంటి తలనొప్పులు లేకుండా యువ కథానాయకులు గుర్రపు స్వారీ ముందే నేర్చుసుకుంటున్నారు. తామూ తక్కువేం కాదంటున్నారు నవతరం హీరోయిన్లు. అయితే.. హీరో సాయి ధరంతేజ్ పోస్టు చేసిన ఓ వీడియో చూస్తే మాత్రం గుర్రపు స్వారీ తెలిసిన వారు కూడా నోరెళ్లబెట్టాల్సిందే!! పదో తరగతి చదువుతున్న ఓ బాలిక గుర్రంపై దర్జగా వెళ్తున్న ఓ వీడియోను మనోజ్ కుమార్ అనే నెటిజన్ పోస్టు చేశారు. పైగా ఆ బాలిక వార్షిక పరీక్షలు రాయడానికి పరీక్షా కేంద్రానికి గుర్రంపై వెళ్తోందట. ఆ బాలిక కేరళలోని త్రిసూర్‌కు చెందిన అమ్మాయిగా ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను హీరో సాయి తేజ్, ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

No comments:

Post a Comment