Breaking News

05/04/2019

ఏపీలో అధికార మార్పిడి

రాజ్యాధిపత్యం శని చేతిలోకి రావడంతో అవినీతిపరుల ఆగడాలు
విజయవాడ, ఏప్రిల్ 5 (way2newstv.in)
అరవై ఏళ్లకు ఒకసారి వచ్చే తెలుగు సంవత్సరాది కాలక్రమంలో వికారినామ సంవత్సరం సంఖ్య 33వది. ఇది శత్రువులకు కోపం కలిగిస్తుందనే నానుడి ఉంది. 1899, 1959 ఇలా అరవై ఏళ్ల తర్వాత 2019లో మరోసారి వికారినామ సంవత్సరం వచ్చింది. ఇక, ఈ ఏడాది రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి శని. మంత్రి - రవి. సస్యాధిపతి, నీరసాధిపతి - కుజుడు. ధాన్యాధిపతి- చంద్రుడు... రసాధిపతి - శుక్రుడు. ములుగు సిద్ధాంతిగారి పంచాంగం ప్రకారం నవనాయక ఫలాలు ఇలా ఉన్నాయి. రాజ్యాధిపత్యం శని చేతిలోకి రావడంతో అవినీతిపరుల ఆగడాలు విచారించబడతాయి. న్యాయస్థానాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి. పేదల కనీస అవసరాలు తీరుతాయి. శనికి రాజ్యాధిపత్యం వచ్చిన కారణంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరుగుతుంది. వ్యవసాయం లాభసాటిగా సాగుతుంది. ప్ర‌కృతి వైపరీత్యాలు మాత్రం చరిత్రలో భయపడే విధంగా ఉంటాయి. మంత్రి స్థానంలో రవి సంచారం వల్ల నకిలీ ఔషధాలు బెడద ఎక్కువగా ఉంటుంది. 


ఏపీలో అధికార మార్పిడి

ఖరీదైన ఔషధాల ధరలు మరింత పెరుగుతాయి. అన్నింటి కంటే హాస్పిటల్స్ వ్యాపారాలు మిన్నగా ఉంటాయి. నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయి. విడాకులు తీసుకునే జంటల సంఖ్య పెరుగుతుంది. పోటీ పరీక్షలలో మహిళలే ఎక్కువగా విజయం సాధిస్తారు. అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడతాయి. ఎండలు అధికంగా ఉంటాయి. వర్షాకాలం కూడా కొంపముంచుతుంది. దొంగ బాబాలు, స్వామీజీలు వ్యవహారాలు బయటపడినా జనం వారినే నమ్ముతారు. సేనాధిపతి స్థానంలో శని ఉండటం వల్ల యుద్ధం అనివార్యమవుతుంది. అంతర్యుద్ధం కూడా తప్పదు. తీవ్రవాద కార్యకలాపాలు అధికమవుతాయి. ఉగ్రవాదులను కూడా సైన్యం పెద్ద మొత్తంలో మట్టుబెడుతుంది. అశ్లీల చిత్రాలు, సమాజాన్ని తప్పుదోవ పట్టించే చిత్రాలకు ఆదరణ లభిస్తుంది. వెకిలితనం, జుగుప్స కలిగించే పనులు హాస్యంగా కొనియాడబడతాయి. స్మగ్లింగ్, అక్రమ రవాణా లాంటి నేరాలు అధికమవుతాయి. స్వలింగ్ సంపర్కుల సంఖ్య అధికమవుతుంది.సస్యాధిపతి కుజుడు కావడంతో వ్యవసాయం ఖర్చు పెరుగుతుంది. రైతులకు ఆశించిన లాభాలు ఉండవు. భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల లాభనష్టాలు సరిసమానంగా ఉంటాయి. పాడి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. చంద్రుడు ధాన్యాధిపతి కావడంతో వడ్లు ధరలు పెరుగుతాయి. నీళ్లు, మద్యం, విద్యా తదితర వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయి. విదేశాలపై మోజుపెంచుకునేవారు అధికమవుతారు. నిరుద్యోగం అధికమవుతుంది. 75 శాతం ప్రేమ పెళ్లిళ్లు విఫలమవుతాయి. మానసిక ఉన్మాదులు అధికమవుతారు. అక్రమ సంబంధాలు వల్ల నేరాలు అధికమవుతాయి. వీటిలో మహిళల పాత్ర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మహిళల మాదిరిగానే పురుషులకు కూడా రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఉండాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. అర్ఘ్యాధిపతి శని కావడం వల్ల వర్షపాతం మధ్యస్తంగా ఉంటుంది. పుణ్య నదులకు ప్రతికూల కాలం. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. హిమాలయాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకుంటాయి. ప్ర‌కృతి వైపరీత్యాలు అధికమవుతాయి. దీవుల సమూహాలకు యమగండం పొంచి ఉంది. మేఘాలకు అధిపతి కూడా శని.. దీంతో అకాల వర్షాలు నామమాత్రంగా ఉంటాయి. రుతుపవనాలు ఆలస్యమవుతాయి. తీర ప్రాంతాలు, పర్వత సానువుల్లో అధిక వర్షాలు కురుస్తాయి. వ్యవసాయానికి ఊరట లభించినా ప్రచండ గాలులతో నష్టం సంభవిస్తుంది. పిడుగులు కూడా అధికంగా ఉంటాయి. రసాధిపతి శుక్రుడు కావడంతో అశ్లీలత, అపహాస్యం గొప్ప కళలుగా గుర్తింపు దక్కించుకుంటాయి. యువత పెడదోవ పట్టడానికి డ్రగ్స్ ప్రధాన కారణమవుతాయి. పండ్లు, ఆకుకూరలు సహజత్వాన్ని కోల్పోతాయి. మానవతా విలువలు క్షీణిస్తాయి. నిత్యావసర వస్తువుల్లో నీళ్లు కూడా వచ్చి చేరతాయి. దొంగ స్వామీజీలు, జ్యోతిషులు విజృంభిస్తారు. అగంట్లో అమ్మతనం, దైవానుగ్రహం దొరుకుతాయి. స్నేహాలు, అనుబంధాలు, అప్యాయతలు అన్నీ ఆర్థికపరమైన దారిలోనే నడుస్తాయి. నీరసాధిపతి కుజుడు కావడంతో ఆధ్యాత్మిక రంగంలో వారికి అధిక ఆదాయం లభిస్తుంది. ఉగ్రవాద చర్యలు కొన్ని భగ్నమైనా వాటి విధ్వంసాలు మాత్రం పెను ప్రభావం చూపుతాయి. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోతాయి. పెద్దల మాటను పిల్లలు వినే పరిస్థితి ఉండదు. 

No comments:

Post a Comment