Breaking News

22/04/2019

తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లు రెడీ

హైద్రాబాద్, ఏప్రిల్ 22  (way2newstv.in)
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న టీఎస్ ఎంసెట్-2019 పరీక్ష హాల్‌టికెట్లను జేఎన్‌టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ పరీక్ష హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 1 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 


 తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లు రెడీ

ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలకు మొత్తం 2,16,362 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. షెడ్యూలు ప్రకారం వీరికి మే 3 నుంచి 9 వరకు విభాగాల వారీగా ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి; మే 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటిదాకా ఎంసెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

No comments:

Post a Comment