Breaking News

30/04/2019

బిజెపి ధర్నా

రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 30  (way2newstv.in)  
రాజన్న సిరిసిల్లా జిల్లా పాలనాధికారి కార్యాలయాన్ని మంగళవారం బిజెపి నేతలు ముట్టడించారు. బిజెపి నాయకులు కలెక్టరేట్ ముట్డడిస్తారనే సమాచారం మేరకు కలెక్టరేట్ ముందు పోలీసులు ముందస్తుగా బంధోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికి బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కలెక్టరేట్ ను ముట్టడించారు. 


 బిజెపి ధర్నా

అనంతరం వారు మాట్లాడుతూ  ఇంటర్ బోర్డు వ్యవహారశైలి తో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మేల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునే సమయం కేసిఆర్, కేటీఆర్ లకు ఉంది కానీ ఇంటర్ విద్యార్థులను పట్టించుకునే సమయం లేకుండా పోయిందని ఆరోపించారు.

No comments:

Post a Comment