Breaking News

09/04/2019

యాడ్స్ తో గూగుల్ కళకళ...

టీడీపీ యాడ్ కోసం లక్షా 50వేలు..బీజేపీ యాడ్ కు 2,500
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8, (way2newstv.in)
ప్రపంచంలో ఏ సమాచారం గురించి అడిగినా ‘గూగుల్’ క్షణాల్లో చెప్పేస్తోంది. దీంతో వార్తలు, విశ్లేషణలు, వినోదం తదితర అంశాలను ఎక్కువ మంది గూగుల్ ద్వారానే తెలుసుకుంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు సైతం ‘గూగుల్’పై దృష్టి పెట్టాయి. దేశంలో అత్యధిక ప్రజలు ఇంటర్నెట్ ద్వారానే సమాచారాన్ని తెలుసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటనలకు ‘గూగుల్’ను వేదికగా చేసుకున్నాయి. గూగుల్‌కు ఉండే పాపులారిటీని రాజకీయ పార్టీలు వాడేసుకుంటున్నాయి. ఈ సరికొత్త ట్రెండ్‌ ఈ ఎన్నికల నుంచే ప్రారంభమైంది. ‘గూగుల్ యాడ్స్’ ద్వారా ఇంటర్నెట్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. ఇందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ‘గూగుల్ యాడ్స్’ కోసం ఏయే పార్టీ ఎంత వెచ్చిస్తుందనే వివరాలను ‘గూగుల్’ సంస్థ బయటపెట్టింది. 
టీడీపీ ముందంజ: 



యాడ్స్ తో గూగుల్  కళకళ...


గూగుల్ యాడ్స్‌లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏర్పాటు చేసుకున్న ప్రకటన సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ, వైసీపీ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాలు గూగుల్ యాడ్స్‌ను ఎక్కువగా ఇస్తున్నాయో పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. తొలి విడత ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు ప్రకటన కోసం భారీగానే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ పొలిటికల్ యాడ్స్ లైబ్రరీ ప్రకారం లెక్కలు ఇలా ఉన్నాయి. 
బీజేపీ రూ.1,21,48,600
వైసీపీ రూ.1,04,34,500
పారమాన్య స్ట్రటజీ కన్సాల్టింగ్ ప్రై.లి. (టీడీపీ)* రూ.85,25,300
డిజిటంట్ కన్సాల్టింగ్ పై.లి. (టీడీపీ)* రూ.63,43,800
ఎథినాస్ డిజిటల్ మార్కెటింగ్ ప్రై.లి. (టీడీపీ)* రూ.1,56,800
కాంగ్రెస్ రూ.54,100
పామ్మి సాయి చరణ్ రెడ్డి రూ.26,400
హర్షనాథ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రై.లి. రూ.6,300
జస్కరన్ ధిల్లాన్ రూ.5,400
విదూలీ మీడియా టెక్ ప్రై.లి. రూ.1,300
ఆకుల సత్యనారాయణ రూ.400(* టీడీపీ యాడ్ కన్సల్టెంట్స్ ఖర్చు పెట్టిన మొత్తం రూ.1,50,25,900)
రాష్ట్రాలవారీగా ఎన్నికల ఖర్చు:
రాష్ట్రం వ్యయం
ఆంధ్రప్రదేశ్ రూ.1,73,56,100
తెలంగాణ రూ.72,78,300
ఉత్తరప్రదేశ్ రూ.18,47,300
మహారాష్ట్ర రూ.17,19,500
బీహార్ రూ.10,53,300
ఢిల్లీ రూ.9,96,500
పశ్చిమ బెంగాల్ రూ.9,21,900
కర్ణాటక రూ.9,09,700
గుజరాత్ రూ.8,46,400
మధ్యప్రదేశ్ రూ.8,10,900
మొత్తం రూ.3,37,39,900ఎన్ని ప్రకటనలు?: టీడీపీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 1.5 కోట్లతో 106 గూగుల్ యాడ్స్ ఇచ్చింది. అయితే, వీటిలో 36ప్రకటనలు గూగుల్ యాడ్ పాలసీని అతిక్రమించినట్లు తెలిసింది. ప్రామాన్య సంస్థ ఇస్తున్న ప్రకటనలన్నీ వీడియో ప్రకటనలే కావడం గమనార్హం. ఇవి సుమారు లక్ష నుంచి 10 లక్షల మందికి చేరినట్లు సమాచారం. అయితే ప్రకటనల సంఖ్యలో టీడీపీకి, బీజేపీకి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.
 టీడీపీ 106 ప్రకటనలకు రూ.1.5 కోట్లు ఖర్చుపెడితే.. బీజేపీ 554 ప్రకటనలకు రూ.1.2 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ యాడ్ కన్సల్టెంట్ కంపెనీలు ఖరీదైన యాడ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఒక్కో యాడ్‌కు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తుంటే.. బీజేపీ ఒక్కో ప్రకటనకు రూ.2,500 వ్యయంతో చౌకైనా యాడ్స్‌తో దూసుకెళ్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం తమ మేనిఫెస్టోను మాత్రమే గూగుల్ యాడ్స్ ద్వారా ప్రకటిస్తోంది. ఇప్పటివరకు రూ.54,000 మాత్రమే ఖర్చు చేసింది. వైసీపీ కూడా టీడీపీ దారిలోనే ప్రయాణిస్తోంది. ఇప్పటి వరకు రూ.కోటి వెచ్చించిన ఆ పార్టీ గూగుల్‌లో 107 ప్రకటనలు ఇచ్చింది. వీటిలో 11 వీడియో యాడ్స్ కాగా మిగతా 96 ఫొటో, బ్యానర్ ప్రకటనలు. రూ.250 నుంచి రూ.2,500 చౌకైన యాడ్స్ అందుబాటులో ఉన్నా.. టీడీపీ, వైసీపీలో ఖరీదైన ప్రకటనలకే మొగ్గు చూపడం గమనార్హం. బీజేపీ మాత్రం తక్కువ ఖర్చు ఎక్కువ ప్రకటన సూత్రంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గూగుల్‌తోపాటు సోషల్ మీడియా వేదికలపై కూడా రాజకీయ పార్టీలు ప్రకటనల దాడి చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.10 కోట్లు ప్రకటనల కోసమే వెచ్చించాయి. ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ రిపోర్టుల ప్రకారం.. రెండు నెలల్లో 51,810 రాజకీయ ప్రకటనలు వచ్చాయి, వాటి విలువ రూ.10.32 కోట్లు. వీటిలో అత్యధిక ప్రకటనలు బీజేపీ, ఆ పార్టీ మద్దతుదారుల నుంచి వచ్చినవే. బీజేపీకి చెందిన ‘భారత్ కె మన్ కి బాత్’ పేజీ 3,700 ప్రకటనల కోసం రూ.2.23 కోట్లు వెచ్చించింది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’, ‘నేషన్ విత్ నమో’ వంటి పేజీలు 1,100 ప్రకటనలకు రూ.36.2 లక్షలు వెచ్చించాయి. టీడీపీ రూ.1.58 లక్షలు, ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్ పార్టీ రూ.8.56 లక్షలు, కాంగ్రెస్ పార్టీ రూ.58,355 ఖర్చు చేశాయి

No comments:

Post a Comment