Breaking News

25/04/2019

వెంకన్న బంగారాన్ని రాజకీయం చేస్తున్నారువెంకన్న బంగారాన్ని రాజకీయం చేస్తున్నారు

విజయవాడ ఏప్రిల్ 25 (way2newstv.in)  
భక్తుల మనోభావాలతో, వెంకటేశ్వర స్వామి బంగారంతో వైసిపి నేతలు రాజకీయం చేయడం దుర్మార్గం.  ప్రభుత్వం, టిడిపి పై ఎ2  ముద్దాయి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అయన మీడియతో మాట్లాడారు. ఎటెన్షన్ డైవర్షన్ ముఠా నాయకుడిగా విజయసాయి రెడ్డి పని చేస్తున్నారు. తెలంగాణ లో 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కోడి కత్తి పార్టీ నేతలకు కనిపించదు. అక్కడ విషయాలను పక్కదారి పట్టించేందుకు టిడిపి పై, టిటిడి బంగారం పై ట్వీట్లు పెడుతున్నారని విమర్శించారు. పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, వంటి పధకాలకు నిధులు నిలుపుదక చేసి ప్రజలకు అన్యాయం  చేస్తున్నారు. ఓటాన్ ఎకౌంటు బడ్జెట్, ఎన్నికలలో చెప్పిన విధంగా మేం చేసి చూపాం. వీటిని తట్టుకోలేక మా మీద పడి రోజూ ఏడుస్తున్నారు. ఆరోజు ఏడు కొండలు రెండు కొండలు అన్నారు.. ఏమైంది. దేవుడికి కూడా శఠగోపాలు పెట్టే విధంగా విజయసాయి రెడ్డి నీచమైన భాష వాడుతున్నాడని అన్నారు. బినామీ, బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి, తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ వేల కోట్లు దోచుకుంది వాస్తవం కాదా. 


వెంకన్న బంగారాన్ని రాజకీయం చేస్తున్నారు

బెయిల్ పై బయటకొచ్చిన ఆర్ధిక నేరగాళ్లు వ్యాఖ్యలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.  బెయిల్ చట్టాలను ఉల్లంఘించిన జగన్, విజయ సాయి రెడ్డి లపై చర్యలు తీసుకోవాలి. వారి అక్రమాలను బయట పెడుతున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు పై వ్యక్తిగత విమర్శలు చేస్తారని అన్నారు. ఈవిఎం మొరాయించినా, ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా  జగన్ కు కనిపించవు. అవినీతి దొంగలకు ఇవేమీ కనిపించవు.. టిడిపి పై  బురద జల్లడమే వారి పని. టిడిపి అధికారంలోకి వస్తుందనే వాస్తవం వారికి ఇప్పుడు బోధ పడిందని అన్నారు. అందుకే నోటికొచ్చినట్లు నీచంగా కూస్తున్నారు. పోలవరం కు కేసిఆర్ అడ్డం పడకపోతే కోర్టులో కేసు ఎందుకు వేశారో చెప్పాలి. ప్రజలు, రైతులను రెచ్చగొట్టే విధంగా కేసిఆర్, జగన్ కు కలిసి కుట్రలు చేస్తున్నారు. లోటస్ పాండ్ లో కులుకుతూ ఎపి ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతావా అని ప్రశ్నించారు. కేసిఆర్ నుంచి వేయి కోట్లు తీసుకుని, వారి మోచేతి నీళ్లు తాగుతున్న జగన్ కు సిగ్గుందా.కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ లొ కేసులు వేస్తుంటే ..జగన్ కు కనీసం ఖండించే దమ్ము లేదు. కేంద్రం ఇచ్చిన డిజైన్లు ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతుందని అన్నారు. గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం అనేక అక్రమ ప్రాజెక్టు లు నిర్మిస్తున్నారు. వేయి కోట్ల కు కక్కుర్తి పడిన జగన్ .. కేసిఆర్ కు సహకరిస్తున్నాడు. వర్షాలు ఎక్కువుగా పడే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎఫ్.సి.ఐ కూడా బాధ్యత గా ఉంటూ గోడౌన్లు ఖాళీ చేయాలని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు నష్టపోకుండా చూడాలి. వంతులు వేసుకోకుండా సామాజిక బాధ్యత గా అందరూ సమన్వయంతో పని చేయాలి. పోలవరం ప్రాజెక్టు పనులు 70శాతం వరకు జరిగాయని అయన అన్నారు.

No comments:

Post a Comment