Breaking News

25/04/2019

మహానందిని అభినందించిన నారా చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్ 25 (way2newstv.in)  
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని సుదర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బుల్లెట్ పై తిరుగుతూ ప్రచారం నిర్వహించిన శ్రీశైలం మహానందిని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.  ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలని బలమైన కోరికతో యూసుఫ్ గూడ కృష్ణనగర్కు చెందిన శ్రీశైలం మహానంది సుదీర్ఘ ప్రచారం చేశారు.


మహానందిని అభినందించిన నారా చంద్రబాబు

తన బుల్లెట్ ను పూర్తి పసుపు రంగులో చంద్రబాబు ఫొటోలతో, ప్రభుత్వ పథకాల స్లోగన్ లతో అలంకరించి, జెండాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల ముందు ఆంద్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాలలో తిరుగుతూ ప్రచారం చేశారు.  ఎన్నికల ముందు రోజుకు మొత్తం 175 నియోజకవర్గాలు తిరిగి సంపూర్ణ  ఆంధ్రప్రదేశ్ ప్రచారం చేశారు.  దీంతో మహానందిని కుటుంబ సమేతంగా రావాలన్నలచంద్రబాబు పిలుపు మేరకు  మహానంది తన కుటుంబంతో విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిసారు.  ముఖ్యమంత్రి మహానందిని ఆయన కుటుంబాన్ని ఘనంగా సన్మానించారు.

No comments:

Post a Comment