Breaking News

25/03/2019

హైకోర్టును ఆశ్రయించిన వివేకా భార్య

హైద్రాబాద్ మార్చి 25, (way2newstv.in)
మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసు దర్యాప్తు విషయంలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గు తేల్చాలని సోమవారం (మార్చి 25) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కూడా హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తన చిన్నాన్న హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించండి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.


 హైకోర్టును ఆశ్రయించిన వివేకా భార్య

ఈ హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. సౌభాగ్యమ్మ పిటిషన్‌తో పాటు అంతకు ముందు దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు మంగళవారం విచారించనుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఏపీ పోలీసుల తీరుపై అనుమానాలు వస్తున్నాయంటూ ఆయన కుమార్తె వైఎస్ సునీత ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా.. ఒక్క క్లూ సంపాదించలేకపోయారని ఆమె ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీసులపై ఎవరో ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. వివేకా హత్య కేసు కొలిక్కి వచ్చిందని.. త్వరలోనే కేసు వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు

No comments:

Post a Comment