Breaking News

06/03/2019

సౌత్ కోస్తా రైల్వే డివిజన్ తో అన్యాయమే

శ్రీకాకుళం, మార్చి 6 (way2newstv.in)
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్లో భాగంగా వాల్తేరు డివిజన్ ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి రామ్మోహన్ మంగళవారం సాయంత్రం ఈ దీక్షను ప్రారంభించారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాత్రి దీక్షా శిబిరం వద్దే బస చేసిన రామ్మోహన్.. బుధవారం ఉదయం దీక్షను విరమించారు. కాలేజీ విద్యార్థినులు రామ్మోహన్ తో నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన ఉత్తరాంధ్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి, అన్ని హంగులతో కూడిన విశాఖ జోన్ ను సాధించుకోవడానికి ఈ దీక్షను చేపట్టినట్టు రామ్మోహన్ చెప్పారు. 


 సౌత్ కోస్తా రైల్వే డివిజన్ తో అన్యాయమే

వాల్తేరు డివిజన్కు 120 సంవత్సరాల చరిత్ర ఉందని, అలాంటి డివిజన్ ను ఎలా రద్దుచేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. సుమారు రూ.6వేల కోట్ల ఆదాయంతో దేశంలోని అగ్రస్థానంలో ఉన్న ఐదు డివిజన్ లలో వాల్తేరు ఒకటిగా నిలిచిందని గుర్తుచేశారు. అలాంటి డివిజన్ ను రద్దుచేశారంటే ఇది కచ్చితంగా ఉత్తరాంధ్రపై కక్ష సాధింపు చర్యేనని వ్యాఖ్యానించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న స్టేషన్లన్నీ ఖుర్దా రోడ్డు డివిజన్లో ఉన్నాయి. వీటన్నిటినీ కొత్త జోన్లో కలపాలని రెండేళ్లుగా నేను చేస్తోన్న పోరాటానికి ఇంత వరకు సమాధానం లేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. కొత్తగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్ సరిహద్దులు ఏమిటో స్పష్టంగా తెలియజేయలేదు. ఇటువంటి సమయంలో పోరాడాల్సిన బాధ్యతపై మనందరిపై ఉంది. అందుకే స్థానిక ప్రజాప్రతినిధులుగా మనమందరం ఈ ముందడుగు వేశాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న స్టేషన్లన్నీ ఈ జోన్ లోకి రావాలి. అప్పుడు కానీ మనకు న్యాయం జరగదు’ అని రామ్మోహన్ నాయుడు అన్నారు. 

No comments:

Post a Comment