Breaking News

27/03/2019

పెళ్లి కానుక కింద రూ. లక్ష ఇస్తా: చంద్రబాబు

కర్నూలు, మార్చి 27, (way2newstv.in
త్వరలో పెళ్లి కానుక కింద రూ. లక్ష ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుక బడిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. పసుపు కుంకుమతో మహిళలను ఆదుకుంటున్నామన్నారు. విదేశీ విద్యకు 15 లక్షలు ఇస్తున్నామన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.  


పెళ్లి కానుక కింద రూ. లక్ష ఇస్తా: చంద్రబాబు

చేనేతలకు రుణ మాఫీ చేశామని, ఉచిత కరెంట్ ఇచ్చామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ. 5 లక్షలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పేదల కోసం 30 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటివరకు 11 లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేశామని చెప్పారు. మైనార్టీలకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కాపాడుతున్నామని అన్నారు.  షాదీఖానాలు నిర్మించామన్నారు. విదేశీ విద్యకు రూ. 15 లక్షలు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో మంత్రాలయం- కర్నూలు మధ్య రైల్వేలైన్ వస్తుందన్నారు. రాష్ట్ర విభజన హామీలు అడిగితే ప్రధాని మోదీ తనపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

No comments:

Post a Comment