నంద్యాల మార్చి 19 (way2newstv.in):
.తెలుగుదేశం పార్టీలో టికెట్ లభించకపోవడంతో ఆ పార్టీ సినీయర్ నేత ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం ఉదయం 6 గంటలనుంచి కూతురు సుజలతో కలసి కూరగాయల మార్కెట్లో ప్రచారాన్ని ప్రారంభించారు.
స్వతంత్ర అభ్యర్థిగా నే ప్రచారం మొదలు పెట్టిన యస్ పీ వై రెడ్డి
ఈ సందర్భంగా ఆ ప్రాంతంవారు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీవై రెడ్డి చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరికి పలకరిస్తూ, అభివాదాలు చేస్తూ ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. వ్యాపారులందరు ఆయన వద్దకు వెళ్లి మా ఓట్లన్నీ మీకే వేస్తామని అన్నారు.
No comments:
Post a Comment