Breaking News

29/03/2019

కర్నూలులో పుట్టి పెరిగా..టిజి భరత్

ఇక్కడి సమస్యలు, ఇబ్బందులు నాకే తెలుసు
..విజన్ యాత్ర ద్వారా ప్రతి వీధిలో తిరిగా
..అవకాశం ఇస్తే ప్రజలకోసం పనిచేస్తా
కర్నూలు, మార్చి 28,(way2newstv.in):
కర్నూలులోని ప్రతి వీధిలో తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి 2019-2024కు విజన్ను తయారుచేసినట్లు కర్నూలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి టి.జి భరత్ తెలిపారు. కర్నూలులోనే పుట్టి పెరిగానని చెప్పారు. ఇక్కడి ప్రజలకు ఏం కావాలో కర్నూలును ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసన్నారు. గురువారం నగరంలోని బుధవారపేట, దండిగేరి, శ్రీరాంనగర్, బంగారుపేట, జొహరాపురం, నరసింహారెడ్డి నగర్, నెహ్రూనగర్, వడ్డెగేరి ప్రాంతాలకు చెందిన ప్రజలు టి.జి భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 


కర్నూలులో పుట్టి పెరిగా..టిజి భరత్

టి.జి భరత్కు అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే టి.జి భరత్ ఎమ్మెల్యే అవ్వడం అవసరం అన్నారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఏసీ రూముల్లో కూర్చోని మేనిఫెస్టో తయారుచేయలేదన్నారు.  65 రోజులు నగరంలోని వార్డుల్లో ప్రతి వీధిలో తిరిగి 18 అంశాలతో కూడిన మేనిఫెస్టో తయారుచేశానన్నారు. ప్రశాంతంగా ఉన్న కర్నూలు నగరంలో కులం పేరుతో చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, బంగి శ్రీనివాసులు, వినోద్ కుమార్, రవితేజ, విల్సన్, రాము గౌడ్, కైలాష్, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment