Breaking News

19/03/2019

దుష్ట శక్తులకు బుద్ది చెప్పాలి

కర్నూలు, మార్చి 19 (way2newstv.in): 
ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.  విభజన హామీలను మోడీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. మంగళవారం కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా అడ్డుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సుప్రీంకోర్టులో కేసు వేశారని ఆయన చెప్పారు. డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లు తాము వాడుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. 


దుష్ట శక్తులకు బుద్ది చెప్పాలి

రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని సంక్షేమ పథకాల లబ్ధిదారులు టిడిపి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.  సిఎం రిలీఫ్ కింద ప్రజల ఆరోగ్యానికి ఆర్థికంగా అండగా నిలబడ్డామని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు ఆర్థికంగా స్వావలంబన కల్పించామని ఆయన అన్నారు. పండుగల కానుకలు, చంద్రన్న బీమాతో ఆదుకుంటున్నామని ఆయన చెప్పారు.. కోటి మంది చెల్లెమ్మలకు ఒకే అన్నగా నిలబడినందుకు తనకెంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. టీడీపీ విజయ రహస్యం 65 లక్షల మంది పసుపు సైనికులేనని, జెండాలు మోసి ఎన్నికలప్పుడు పార్టీని గెలిపించేది కార్యకర్తలేనని చంద్రబాబు అన్నారు.  నాయకులందరూ వారిని గౌరవించాలని అన్నారు జగన్ మోహన్ రెడ్డిపై వ్యాఖ్యనిస్తూ . హైదరాబాద్ లోని తన నివాసమైన లోటస్ పాండ్ లో జగన్ ఉంటారు తప్ప, అమరావతి ప్రాంతాన్ని చూసేందుకు మాత్రం ఆయన ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు దుష్టశక్తులకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.

No comments:

Post a Comment