పాలమూరులో బీజేపీ సభతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టింది
* ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయాక కేసీఆర్కు రైతులు గుర్తుకు వచ్చారు
* తెరాస ఎంపీ అభ్యర్థులను ఓడిస్తే తప్ప కేసీఆర్ సచివాలయానికి రారు
* మూడు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన మార్పులు
* అసదుద్దీన్ ఓవైసీ కంటే పెద్ద ముస్లిం కేసీఆరే
* బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్ మార్చ్ 30 (way2newstv.in):
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన సభ విఫలం తెరాస పట్ల ప్రజల అభిప్రాయానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మరో మూడు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన మార్పులు చూస్తామని వ్యాఖ్యానించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయాక కేసీఆర్కు హఠాత్తుగా రైతులు గుర్తుకు వచ్చారని ఎద్దేవాచేశారు. కేసీఆర్ కుమార్తె కవిత నియోజకవర్గంలోనే రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని చెప్పారు. 180 మంది రైతులు కవితకు వ్యతిరేకంగా బరిలో నిలిచారని గుర్తుచేశారు. తెరాస ఎంపీ అభ్యర్థులను ఓడిస్తేనే కేసీఆర్ ప్రగతి భవన్ను వీడి సచివాలయానికి వస్తారని లక్ష్మణ్ అన్నారు. అధికారం, అహంకారంతో విర్రవీగే వాళ్లకు ప్రజలే గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రజలు సాగునీరు, తాగునీరు కోరుకుంటుంటే అవి ఇవ్వకుండా ఆదాయం కోసం మద్యం దుకాణాలు ఎక్కడికక్కడ నెలకొల్పుతున్నారని విమర్శించారు.
ఇది సారు..కారు..సర్కారు కాదు... బారు..బీరు..సర్కారు
‘‘తెరాస చెబుతున్నట్లు ఇది సారు.. కారు.. సర్కారు కాదు. బారు.. బీరు.. సర్కారు’’ అని ఎద్దేవాచేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలోపార్టీ నేతలు ఎస్.మల్లా రెడ్డి,కొల్లి అధికార ప్రతినిధి కొల్లి మాధవి,మనోహర్ రెడ్డి లతో కలిసి మీడియాతో మాట్లాడారు.పాలమూరులో బీజేపీ సభతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పతనానికి పాలమూరు సభే నాంది అన్నారు. దేశానికి మోదీ అవసరమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీలంతా ఓడిపోతే కేసీఆర్ సచివాలయం బాటపడతారని చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని అయ్యాక తెలంగాణలో పెనుమార్పులు తథ్యమని వెల్లడించారు.రెండు యాగాలు చేసిన మీరు(కేసీఆర్) హిందువా.. ఏ విధంగా హిందువో మీరు చెప్పాలి..వక్రబుద్ధితో నువ్వు చేసే యజ్ఞం.. యజ్ఞం కాదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కంటే పెద్ద ముస్లిం కేసీఆరే అని లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. బీజీపీకి 150 సీట్లు కాదు.. 300 సీట్లు వస్తే నువ్వు రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నేతల్లో అంతర్మధనం ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. అహంకారంతో, అధికార మదంతో విర్రవీగే నాయకులకు నిన్నటి ఎల్బీస్టేడియం సభ అట్టర్ ప్లాప్ కావడంతో ఎటూ పాలుపోవడం లేదన్నారు. నోటి దురుసు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనం చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్న ఈ కుటుంబ పాలన నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని విముక్తుల్ని చేయాలని కోరారు. మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి, గిరిజన మంత్రి కూడా లేరని మండిపడ్డారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటే ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారనుకుంటే విచ్చిలవిడిగా డబ్బులకు పదవులకు అమ్ముడుపోతూ పార్టీ మారుతున్నారని విమర్శించారు. శతకోటి లింగాల్లో బోడి లింగం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. 16 ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తారో కేసీఆర్ చెప్పాలన్నారు. సైనికులను అవమాన పర్చిన కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఎన్ని గెలుస్తామో చెప్పడానికి తాను జ్యోతిష్కుడిని కాదన్నారు. కచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుస్తామని, వోటింగ్ శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఏప్రిల్ 1న మోదీ పర్యటన ఉంటుందని తెలిపారు.
No comments:
Post a Comment