Breaking News

26/02/2019

వాయు సేన దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26, (way2newstv.in
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున  భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్-2 జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల జవాన్లకు సెలవులు రద్దు చేసింది. 


వాయు సేన దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

పాక్ నుంచి ప్రతీకార దాడులు ఉంటాయనే అనుమానంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, భారత సరిహద్దు మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం పాక్-భారత్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

No comments:

Post a Comment