Breaking News

27/02/2019

సిటీలో యదేఛ్చగా వ్యభిచారం

హైద్రాబాద్, ఫిబ్రవరి 27  (way2newstv.in)   
నగరంలో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాన్నివ్వడం లేదు. ముఖ్యంగా వ్యభిచార కేంద్రాల నిర్వాహకులు పోలీసుల కళ్లుగప్పి దందాను యథేచ్ఛగా చేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ పోలీసులు దాడులు చేస్తూ ముఠాలను పట్టుకుంటున్నా ఈ వ్యవహారానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 


సిటీలో యదేఛ్చగా వ్యభిచారం

సికింద్రాబాద్‌ ఈస్ట్ మారేడుపల్లిలోని రాజేష్‌కుమార్ ‘ట్రాంక్విల్ యూని సెక్స్ సెలూన్ అండ్ స్పా’ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. పైకి ఇది మసాజ్ సెంటరే అయినా అక్కడికి వచ్చే కస్టమర్లను ఆకర్షించి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి ఐదుగురు యువతులను రప్పించి ఈ దందా కొనసాగిస్తున్నాడు. అతడికి శ్రావణ్‌కుమార్, విద్యాసాగర్‌ సాయం చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా రాజేశ్ స్నేహితులు శ్రావణ్‌కుమార్, విద్యాసాగర్‌, విటులు విద్యానగర్‌కు చెందిన సురేష్, నాచారం ప్రాంతానికి చెందిన మేడల రాజ్‌‌కుమార్‌తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 8 సెల్‌‌ఫోన్లు, రూ.13వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. యువతులను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

No comments:

Post a Comment