Breaking News

13/02/2019

సంగారెడ్డి ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి

సంగారెడ్డి, ఫిబ్రవరి 13, (way2newstv.com)
తెరాస  నేత హరీష్ రావు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని విమర్శించారు. కేటాయింపులు లేకున్నా శ్రీరాంసాగర్ కు నీటిని తరలించారని ఆరోపించారు. 


సంగారెడ్డి ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి

కేసీఆర్ కుటుంబ సభ్యుడనే కారణంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేదన్నారు. నీటి తరలింపు విషయం కేసీఆర్కు తెలిస్తే ఆయన ఒప్పుకునే వారు కాదన్నారు. కేసీఆర్ కు చెడ్డపేరు తెచ్చే ఈ నిర్ణయం వెనుక.. హరీష్ రాజకీయ కోణం ఉందనే అనుమానం ఉందని, ఇవన్నీ అడుగుతాననే హరీష్ తనను ఓడించాలని చూశారని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీష్ రావు సంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment