Breaking News

05/02/2019

అంగరంగ వైభవంగా కూడవెళ్లి జాతర

రామలింగేశ్వర స్వామిని అభిషేకించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిద్ధిపేట, ఫిబ్రవరి 05  (way2newstv.in)
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరపల్లి గ్రామంలోని కూడవెళ్లి రామ లింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో గణపతి పూజ, రుద్రాభిశేకం, పల్లకిసేవ, సర్వ దర్శనాలు, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. 


 అంగరంగ వైభవంగా కూడవెళ్లి జాతర

జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారికి అభిషేకం చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ మేరకు ఆలయ అర్చకులు జిల్లా కలెక్టరును పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం ఆలయ నిర్వహకులు కలెక్టర్ ను శాలువా, పూలమాలలతో సన్మానించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి చుట్టు ప్రక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

No comments:

Post a Comment