Breaking News

18/02/2019

15వ ఆర్థిక సంఘం చైర్మన్ కు ఘన స్వాగతం

హైదరాబాద్, ఫిబ్రవరి18 (way2newstv.in
తెలంగాణ రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయానికి  చేరుకున్న 15 వ ఆర్థిక సంఘం చైర్మన్  నందకిషోర్ సింగ్ మరియు ఇతర సభ్యులకు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  డాక్టర్ ఎస్. కె. జోషి , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు లు  ఘనస్వాగతం పలికారు.


15వ ఆర్థిక సంఘం చైర్మన్ కు  ఘన స్వాగతం

15వ ఆర్థిక సంఘం సభ్యులు, డా. అనూప్ సింగ్, డాక్టర్.రమేష్ చంద్, జాయింట్ సెక్రటరీ ముక్ మిత్ సింగ్ భాటియా, మీడియా అడ్వైజర్ మౌసమీ చక్రవర్తి,  డైరెక్టర్లు  గోపాల్ ప్రసాద్, భరత్ భూషణ్ గార్గ్, జాయింట్ డైరెక్టర్ ఆనంద్ సింగ్ పర్మార్, డిప్యూటి డైరెక్టర్ నితీష్ షైనీ, అస్టిస్టెంట్ డైరెక్టర్ సందీప్ కుమార్, డి.డి.ఓ. డి.కె.శర్మ,పిఎస్ త్యాగరాజన్  లతో పాటు ఇతర అధికారులు చైర్మన్ వెంట ఉన్నారు.15వ ఆర్థిక సంఘం చైర్మన్ నేటి నుంచి మూడు రోజుల పాటు అనగా ఈ నెల 20వ తేదీ వరకు హైదరాబాద్ లో నిర్వహించే పలు సమావేశాల్లో పాల్గొంటారు.  ఈ సందర్భంగా ఆయన నేడు పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మొదటగా సమావేశం అవుతారని, అనంతరం ఆయన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం అవుతారు. సాయంత్రం పరిశ్రమల శాఖ అధికారులు,మొదలగు   ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొంటారు.  ఈ నెల 19న జూబ్లీహాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని, అనంతరం సాయంత్రం మీడియా  సమావేశంలో ఆయన పాల్గొంటారు.

No comments:

Post a Comment