Breaking News

27/02/2019

నీరవ్ మోదీకి 147 కోట్ల అటాచ్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27, (way2newstv.in)
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ)‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నీరవ్‌మోదీకి చెందిన రూ.147.72 కోట్ల ఆస్తులను మనీలాండరింగ్‌ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అధికారులు జప్తు చేశారు. వీటిలో ఎనిమిది కార్లు, మెషినరీ, ఆభరణాలతో పాటు పలు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎంఎఫ్‌ హుస్సేన్‌, అమృత షెర్‌-గిల్‌ తదితర ప్రముఖ చిత్రకారులకు చెందిన రూ. 50 కోట్ల విలువైన పెయింటింగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


స్విమ్ సూట్ లో శ్రీ రెడ్డి ఇంటర్వ్యూ

వీటితోపాటు మోడీ గ్రూప్స్‌కు చెందిన ఫైవ్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఖాతాదారులు చెల్లించాల్సిన నగదు, స్థిరాస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. పలు దేశాల్లో నీరవ్‌మోదీకి చెందిన రూ. 1,725.36 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్‌మోదీతో పాటు మరో నిందితుడు మెహుల్‌ చోక్సీలు విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నీరవ్‌ బ్రిటన్‌కు పారిపోగా, చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ప్రాపర్టీలు కాకుండా గతంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం, వజ్ర, ఆభరణాలు తదితర విలువైన వస్తువుల విలువ మొత్తం రూ.489.75కోట్లు ఉంటాయి. ఇప్పటి వరకు వీరిద్దరికి చెందిన దాదాపు రూ.4,765 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment