Breaking News

30/01/2019

బంద్ కు వైసీపీ నో

 విజయవాడ, జనవరి 30, (way2newstv.in)
ప్రత్యేక హోదా కోరుతూ ఫిబ్రవరి 1న చేపట్టే ఏపీ బంద్‌కు తాము మద్దతివ్వడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై వైసీపీ మినహా ఇతర పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హోదా కోసం గతంలో వైసీపీ చేపట్టిన బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి మద్దతివ్వలేదని.. అందుకే ఇప్పుడు తాము ఫిబ్రవరి 1న బంద్‌కు మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తోందని సుబ్బారెడ్డి తెలిపారు. నాలుగుసార్లు రాష్ట్రంలో బంద్ చేపట్టామని, మూడుసార్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశామని, పార్లమెంటులోనూ కేంద్రాన్ని నిలదీశామని తెలిపారు. హోదా కోసం ఎన్డీయే సర్కారుపై తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది తామేనని తెలిపారు.


 బంద్ కు వైసీపీ నో

 ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు అన్నందువల్లే కేంద్రం హోదా ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడేమో ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు దిల్లీలో దీక్షలంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. హోదా కోసం పోరులో టీడీపీతో వేదిక పంచుకునేందుకు ఇష్టం లేకనే ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకాలేదని సుబ్బారెడ్డి తెలిపారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్రానికి అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ధన్యవాద తీర్మానం చేసింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. హోదా కోసం ఎవరితోనైనా కలిసి పోరాడేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి 

No comments:

Post a Comment