Breaking News

24/08/2018

ఏపీలో బీజేపీకి ఉనికి లేదు

విజయవాడ,ఆగస్టు 24, (way2newstv.in)
కేంద్ర  ప్రభుత్వం పై టిడిపి చేస్తున్న పొరాటలపై  ప్రజల దృష్టి మార్చలడానికే బీజేపీ కుట్ర చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లబ్ది చేకూర్చడానికే బీజేపీ నాయకులు టీడీపీ పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. శుక్రవారం నాడు అయన విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎందుకు చెల్లని,  ఎవరికి తెలియని నేతలు మాట్లాడుతున్నారు. కౌన్సిలర్ గా కూడా గెలవలేని వారు కూడా మాట్లాడుతున్నారు. నాలుగు ఏళ్ళు కలసి ఉన్నప్పుడు కనపడని అవినీతి విడిపోయిన తరువాత  బీజేపీ నాయకులకు  అవినితి కనపడిందా అని అయన ప్రశ్నించారు. 



ఏపీలో బీజేపీకి ఉనికి లేదు

గుజరాత్ ప్రభుత్వం 10.7 శాతం వడ్డీ బాండ్లు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10.3 శాతం వడ్డీకి బాండ్లు జారీ చేసింది. పిడి ఎకౌంట్లు,అమరావతి బండ్లపై విచారణ చేయాలంటున్న బిజెపి నేతలు గుజరాత్ బండ్లపై, దేశంలో పిడి  ఎకౌంట్లు సీబీఐ విచారణ కోరే దమ్ము బిజెపి నాయకుల కు ఉందా అని అయన అన్నారు. రాఫెల్ కుంభకోణం 40 వేలకోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ కోరే దమ్ము బిజెపి నేతలకు ఉందా అని అడిగారు. బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీపై ఆయన మెడకు ఏవిధంగా చుట్టుకుందో రాఫెల్ కుంభకోణం మోడీపై చుట్టుకుంటుంది. హౌసింగ్ కోసం కేవలం వెయ్యికోట్లు ఇచ్చి 10 వేల కోట్లు ఇచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారు. గుడ్డ కాల్చి మీద వేసి తుడుచుకో అన్నట్లుగా ఉంది బీజేపీ నేతలు తీరు అని అయన విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ కి ఉనికి లేదు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకునేందు కే వైసిపి,బిజెపి, జనసేన పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీపై ద్రుష్పచారం చేస్తున్నాయని అయన ఆరోపించారు

No comments:

Post a Comment