Breaking News

25/08/2018

కేరళ వరదబాధితులకు స్టార్ ఇండియా రూ.5 కోట్ల ఆర్దిక సహాయం

హైదరాబాద్ ఆగష్టు 25 (way2newstv.in)
ఇటీవల కేరళ రాష్ట్రం లో సంబవించిన వర్షాల వళ్ళ నిరాశ్రయులైన వరదబాధితులకు మానవతా దృక్పదం తో స్టార్ ఇండియా 5 కోట్ల  రూపాయల ఆర్దిక సహాయాన్ని అందించింది.ఈ మేరకు స్టార్ నెట్ వర్క్  సౌత్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కే.మాధవన్ కేరళ ముఖ్య మంత్రి పినరై విజయన్  ను కలిసి 5 కోట్ల రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా మాధవన్ మాట్లాడుతూ మొదట 2 కోట్ల రూపాయలను ప్రకటించినప్పటికీ విపత్తు తీవ్రతను గమనించి అట్టి సహాయాన్ని 5 కోట్లకు పెంచి  అట్టి చెక్కును కేరళ సిఎం కు అందజేసినట్లు ఆయన తెలిపారు.స్టార్ ఇండియా ఉద్యోగులతో పాటు,స్టార్ నెట్ వర్క్ ట్వంటీ ఫిస్ట్  సెంచరీ ఫ్యాక్స్ సంస్తల విరాళాలను జోడించి మొత్తం 5 కోట్లు అందజేసినట్లు ఆయన తెలిపారు.అంతే కాకుండా కేరళ బాధితులకు అండగా నిలబడి వారికి చేతనైన సహాయం అందించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.జరిగిన నష్టం తో పోల్చితే  మనం అందించే సహాయం కొంతే నని అయినా మానవతా దృక్పదం తో తోటి వారికి సహాయం అందించడం మానవ ధర్మ మని ఆయన పేర్కొన్నారు.కేరళ ఎపుడు దయనీయ స్టితి లో ఉందని ఓ మీడియా సంస్థ గా ఈ స్టితి బాధితులకు అందాగా నిలువడం బాధ్యతగా బావిస్తున్నట్లు తెలిపారు.బాధితుల సహాయాన్ని కోరుతూ క్యాప్యన్ చేసే దశని దాటి దీర్ఘకాలిక సహాయాన్ని అన్దేంచే దిశగా ప్రణాళికలు రూపొందిన్చుతున్నట్లు మాధవన్ తెలిపారు.



కేరళ వరదబాధితులకు స్టార్ ఇండియా రూ.5 కోట్ల  ఆర్దిక సహాయం

No comments:

Post a Comment