Breaking News

21/07/2018

ఒడిషాలో భారీ వర్షాలు

విజయనగరం,జూలై 21, (way2newstv .in) 
ఒడిషాలో భారీ వర్షాలు జనజీవనాన్ని స్ధంభింపచేశాయి. ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు కారణంగా ప్రజా రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతోంది.నాగావళి ఉధృతి కారణంగా రాయఘడ జిల్లా జిమిడిపేట వద్ద వంతెన వరదలో కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో బ్రిడ్జి పై ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. మరోవైపు, భువనేశ్వర్ నుండి  హిరాఖండ్  వెళుతున్న హిరాఖండ్ ఎక్స్ ప్రెస్  రాయగడ జిల్లా బాలు మస్కా స్టేషన్ వద్ద వరద నీటిలో చిక్కిపోయింది.  మరో ఇంటర్ సిటీ రైలు కూడా సింగిపురం, టికిరి  స్టేషన్ మద్యచిక్కుకుంది. అధికారులు ప్రత్యామ్నాయం గా  కొరాపుట్ నుండి భువనేశ్వర్ వరకు నడుపుతున్నారు. ఇంకా వర్షాలు కురవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అయిన కొమరాడ నుండి రహదారి జలమయం అయింది.



ఒడిషాలో భారీ వర్షాలు

No comments:

Post a Comment