Breaking News

10/07/2018

ధాయ్ ల్యాండ్ లో 9 మంది సేఫ్

న్యూఢిల్లీ, జూలై 10, (way2newstv.in) 
థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో బందీలైన 12 మంది చిన్నారుల్లో తొమ్మిది బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్..  ఆదివారం నలుగురిని బయిటకు తీయగా...సోమవారం  మరో ముగ్గురు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వీరిలో బలహీనంగా ఉన్న ఒకరిని హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా చియాంగ్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరికి గుహకు సమీపంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బయటకు వచ్చిన వారి సంఖ్య 7కు చేరింది. ఇంకా కోచ్‌తోపాటు మరో ఐదుగురు చిన్నారులను రక్షించాల్సి ఉంది. రక్షించినవారి వివరాలను అధికారులు స్థానిక మీడియాకు వెల్లడించడంలేదు. 



ధాయ్ ల్యాండ్ లో 9 మంది సేఫ్

రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మిగిలిన వారిని కాపాడటానికి మరింత సమయం పట్టవచ్చు. ఆదివారం నలుగురు చిన్నారులను కాపాడిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్‌కు కొన్నిగంటలపాటు నిలిపివేసిన అధికారులు.. కొన్ని గంటల తర్వాత సహాయక చర్యలను తిరిగి ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నాం ముగ్గురు చిన్నారులను విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. జూన్‌ 23న థాయ్‌ లుయాంగ్‌ గుహను సందర్శించడానికి వెళ్లి 12 మంది బాలలు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌.. అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పిల్లలంతా కూడా 11 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారే ఉన్నారు. కోచ్ వయసు 25 సంవత్సరాలు. అయితే భారీ వర్షాలు కురవడంతో వారిని కాపాడటం కష్టంగా మారింది. ఒకానొక దశలో వారిని కాపాడటానికి కొన్ని నెలల సమయం పడుతుందని అంచానావేశారు.  వర్షం ఆగడం, గుహలోని నీటి మట్టం తగ్గించడంలో సఫలం కావడంతో రెస్క్యూ టీమ్‌లు హుటాహుటిన గుహలోకి ప్రవేశించి సహాయ చర్యలు మొదలుపెట్టాయి. ముందుగా బలహీనంగా ఉన్న పిల్లలను బయటకు తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు. 

No comments:

Post a Comment